కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడితో కాంగ్రెస్ కు సంబంధం లేదు

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్
సిరా న్యూస్,న్యూ డిల్లీ ;
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి ఘటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన..కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల వివాదంపై స్పందించారు.రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు సర్వ సాధారణమని.. కానీ విమర్శలు చేసే సమయంలో భాష చాలా ముఖ్యమని చెప్పారు. దాడులను కాంగ్రెస్ పార్టీ సమర్థించదన్నారు.అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషమని..కౌశిక్‌రెడ్డిపై దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *