సిరా న్యూస్, తలమడుగు:
కాంగ్రెస్ పార్టీలో చేరిన దేవాపూర్ గ్రామస్తులు
– పార్టీ నాయకులు బాజభజంత్రీలతో ఘన స్వాగతం
తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామస్తులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ గంధం తిరుపతి, ఉస్మాన్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డిలు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు గ్రామస్తులు బాజభజంత్రీలతో వారికి ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా గ్రామంలోని బాల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, నాయకులు రమేష్ రెడ్డి, వెంకన్న యాదవ్, రమేష్, సర్పంచ్ గంగారాం, మాజీ సర్పంచ్ లస్మన్న, మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీక్, ఎస్సి సెల్ అధ్యక్షులు అశోక్, లోక ప్రవీణ్ రెడ్డి, గాజుల సాంబశివ్, దుస నర్సింహులు, ఈశ్వర్ రెడ్డి, వెంకన్న, గంగాధర్, సంతోష్, పండరి, సల్ల దేవన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.