Congress Kandi Srinivasa Reddy: బాధిత కుటుంబాల‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి ప‌రామ‌ర్శ

సిరాన్యూస్‌,బేల‌
బాధిత కుటుంబాల‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి ప‌రామ‌ర్శ

అంద‌రికీ ఆప్తుడుగా పేరు గాంచిన  కాంగ్రెస్‌ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ప‌ర్య‌టించారు. కుటుంబ పెద్దలను, ఆప్తులను కోల్పోయి విచారంలో ఉన్న కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఆయా కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలపడమే కాకుండా వారికి ధైర్యం చెప్పారు. బేలా మండలం లోని సాంగిడి గ్రామానికి చెందిన యువకుడు (26) బెదొడ్కర్ ప్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబ‌ సభ్యులను పరామర్శించారు. అనంత‌రం అదే గ్రామంలోని గుమ్మడి చంద్రబాగా నిన్న అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ‌ సభ్యులను క‌లిసి పరామర్శించారు. ఆయ‌న మృతి ప‌ట్ల త‌న సంతాపాన్ని వ్య‌క్తం చేసారు. అక్క‌డినుండి జైన‌థ్ మండ‌లం కాప్రీ లో కంది ల‌స్మారెడ్డి మాతృమూర్తి ర‌త్నబాయి మ‌ర‌ణించ‌డంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. అదే గ్రామంలో యెల్మ లింగారెడ్డికి కాలు విర‌గ‌డంతో ఆయ‌న ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. కంది శ్రీనివాస రెడ్డి వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి , సీనియ‌ర్ నాయ‌కులు గిమ్మ సంతోష్, బండి దేవిదాస్ చారి, పోరెడ్డి కిషన్,ఆవుల వెంకన్న, నాగర్కర్ శంకర్,సింగిరెడ్డి రాంరెడ్డి,రూపేష్ రెడ్డి, రావుల సోమన్న రాంరెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *