చిగురుమామిడి, సిరా న్యూస్
మంత్రిని విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యేకు లేదు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించే హక్కు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ కు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు.శనివారం మండల కేంద్రంలోని రాహుల్ జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామపంచాయతీ భవనాలు తామే ప్రారంభించుకుంటామని చెప్పడం బెడ్డూరంగా ఉందన్నారు. పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.మంత్రి హోదాలో అనేక బాధ్యతలు ఉంటాయనే విషయాన్ని తెసుకోవాలని అన్నారు. హైదరాబాద్ కి మాత్రమే ఇన్ చార్జి అని చెప్పడాన్ని ఖండించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, జెడ్పీటీసీ గీకురు రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల రవీందర్, ఐ రెడ్డి సత్యనారాయణ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు పోలు సప్న, చిగురుమామిడి గ్రామ శాఖ అధ్యక్షులు వంగ కనకయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులు షాబుద్దీన్, మండల ప్రధాన కార్యదర్శి పొన్నం సంపత్, మండల ఉపాధ్యక్షులు పూల లచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పచ్చిమట్ల జగన్, సంజీవరెడ్డి, చందబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.