సిరా న్యూస్,ఆదిలాబాద్
గణపతి విగ్రహానికి కరెన్సీ నోట్ల హారం వేసిన లోక ప్రవీణ్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ కాలనీలో ఉన్న కైలాస్ నగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహానికి సోమవారం ఆ కమిటీ అధ్యక్షుడు లోక ప్రవీణ్ రెడ్డి కరెన్సీ నోట్ల హారం (పది రూపాయల నోట్లు.. మొత్తం రూ.5వేలు) వేసి తన ఆధ్యాత్మికతను చాటుకున్నారు. పట్టణ ప్రజలతో పాటు కాలనీవాసులు ఆయురారోగ్యంగా, ఆనందంగా ఉండాలని, సుఖ శాంతులు ప్రసాదించాలని ఆ గణపతికి వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ అగ్రవాల్, సంయుక్త కార్యదర్శి చిట్టిబాబు, సభ్యులు దీపక్, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.