Congress Loka Praveen Reddy: గణపతి విగ్రహానికి కరెన్సీ నోట్ల హారం వేసిన లోక ప్రవీణ్ రెడ్డి

సిరా న్యూస్,ఆదిలాబాద్‌
గణపతి విగ్రహానికి కరెన్సీ నోట్ల హారం వేసిన లోక ప్రవీణ్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ కాలనీలో ఉన్న కైలాస్ నగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహానికి సోమవారం ఆ కమిటీ అధ్యక్షుడు లోక ప్రవీణ్ రెడ్డి కరెన్సీ నోట్ల హారం (పది రూపాయల నోట్లు.. మొత్తం రూ.5వేలు) వేసి తన ఆధ్యాత్మికతను చాటుకున్నారు. పట్టణ ప్రజలతో పాటు కాలనీవాసులు ఆయురారోగ్యంగా, ఆనందంగా ఉండాలని, సుఖ శాంతులు ప్రసాదించాలని ఆ గణపతికి వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ అగ్రవాల్, సంయుక్త కార్యదర్శి చిట్టిబాబు, సభ్యులు దీపక్, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *