కడియం శ్రీహరిని రంగంలోకి దింపిన కాంగ్రెస్ అదిష్టానం..!!
మాజీ మంత్రి ఎర్రబెల్లిపై పై చేయి సాధించేందుకు వ్యూహాత్మక ఎత్తుగడ
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలుగుదేశం లో ఉన్నప్పటి నుండి కడియం శ్రీహరి సన్నిహితులుగా ఉన్న మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు,
శాసనమండలిలో బలం పెంచుకునే దిశగా పావులు కదుపుతున్న కాంగ్రెస్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారాసను బలంగా దెబ్బకొట్టాలనే ఆలోచనతో పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాష్ లకు కాంగ్రెస్ కండువా కప్పించాలని మాజీయంపి రామసహాయం సురేందర్ రెడ్డి సహాయం కోరిన కాంగ్రెస్ పార్టీ. వారిద్దరితో చర్చించే బాద్యత ఖమ్మం యంపి రామసహాయం రఘురాంరెడ్డి కి అప్పగింత. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్సీలలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి మినహా, మిగిలిన నలుగురి పైన కాంగ్రెస్ గురి పెట్టింది.
====================