బీజేపీ
సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
కాంగ్రెస్ ప్రభుత్వం వందరోజుల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో సహా, ఇచ్చిన హామీలన్నీ ఇప్పటివరకు నెరవేర్చలేదని, రైతులు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వంద రోజుల్లో రైతులకు ఎలాంటి హామీని నెరవేర్చక పోవడంతో తమ పార్టీ దీక్షలు చేపడుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారం పోయాక రైతులు గుర్తుకొచ్చారని, తమ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా రైతులకు అండగా ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నుండి తమ అభ్యర్థి బండి సంజయ్ రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానన్న ఆశాభవం వ్యక్తం చేశారు. సమావేశంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
================xx