సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి
* కాంగ్రెస్ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్
బ్యాంకు అధికారులు రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కాంగ్రెస్ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడారు. బ్యాంకులలో రుణాలు తీసుకున్న రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా , ఆ ఖాతాలను ప్రభుత్వ వ్యవసాయ శాఖకు అందించే బాధ్యత బ్యాంకు అధికారులు తీసుకోవాలని అన్నారు. తప్పులు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని, అధికారులు అవగాహన ఉన్న సిబ్బందిని సమకూర్చుకోవాలని కోరారు. తప్పిదాలు జరిగినటువంటి బ్యాంకు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.