సిరాన్యూస్, ఉట్నూర్
బొజ్జన్న బువ్వ అన్నదానాన్ని సద్వినియోగం చేసుకోవాలి
* కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల చైర్మన్ బానోత్ జైవంతరావు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో పేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలనే గొప్ప సంకల్పంతో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ – బొజ్జన్న బువ్వ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ జైవంతరావు పేర్కొన్నారు. సోమవారం ఐటీడీఎ కార్యాలయం ఎదుట బొజ్జన్న బువ్వ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అన్నం వడ్డించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఐటీడిఎ కార్యాలయానికి సూదుర ప్రాంతాల నుండి అర్జీలను చేతపట్టుకొని వారి సమస్యల పరిష్కారం కోసం వచ్చే పేద ప్రజల కష్టాలను గుర్తించిన ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గత ఏడాది నుండి బొజ్జన్న బువ్వ కార్యక్రమం చేపడుతున్నారని పేర్కొన్నారు. పేదింటి కుటుంబం నుండి వచ్చిన ఎమ్మెల్యేకు ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల బాధలు, కష్టాలు తెలుసని సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే బొజ్జన్న అన్నదానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ విశ్వనాథ్,ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు అచ్చదేవానందం,మాజీ మండల అధ్యక్షుడు నర్సయ్య, ఒమేశ్వర్, రాజు, రాజేష్, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.