దళితుల పక్షాన నిలిచిన వారికే కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ టికెట్ కేటాయించాలి

కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎస్సి విభాగం జిల్లా అధ్యక్షులు నరకుడు వెంకటయ్య

సిరా న్యూస్,వర్దన్నపేట;
జిల్లా వర్దన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షడు నరకుడు వెంకటయ్య మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వెంకటయ్య మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ సీటును నిజమైన నికార్సైన,దళితుల పక్షాన నిలిచి పోరాటం చేసిన వ్యక్తులైన నామిండ్ల శ్రీనివాస్ , దొమ్మటి సాంబయ్య లలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వటమే న్యాయం. కాంగ్రెస్ పార్టీ కాష్టకాలంలో పని చేశారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయబ్రాంతులకు గురికాకుండా ఈ 9 సంవత్సరాలు కాపాడారు వీరికే టికెట్ ఇవ్వడం వలన కష్టపడ్డ వారికే కాంగ్రెస్ పార్టీ గుర్తింపు నిస్తుంది అనడానికి ఒక్క సంకేతం ఏర్పడుతుంది.ఈ దేశములో కష్టపడ్డ కార్యకర్తలను గుర్తింపు నిచ్చి ఎమ్మెల్యే,ఎంపీ, ఎమ్మెల్సీ,నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.ఉదాహరణకు మొన్నటి కర్ణాటక ఎన్నికలలో ఒక్క నిరుపేదకు ,తనకు గుడిసె లేదు అయిన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే ను చేసింది.లంబాడ వర్గమునకు చెందిన బలరాం నాయక్ ను గుర్తించి కేంద్ర మంత్రి నీ చేసింది. ఇలాంటి చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.వరంగల్ పార్లమెంట్ సీటును కష్టపడ్డా నాయకులైన నమిండ్ల శ్రీనివాస్, దొమ్మాటి సాంబయ్య లకు ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతూ,ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమములో వర్ధన్నపేట ఎస్సీ సెల్ టౌన్ ప్రసిడెంట్ చేరుపెళ్ళీ బాబు,ఎస్సీ సెల్ జిల్లా నాయకులు అయిన బంగారు సదానందం, ఎర్ర శ్రీకాంత్,కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరాత్రి వెంకట్ నర్స్ లు తదితరులు పాల్గొన్నారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *