సిరా న్యూస్, కాల్వ శ్రీరాంపూర్
స్థానికులకే చైర్మన్ పదవి ఇవ్వాలి : కాంగ్రెస్ నాయకుడు మద్దుల నరేష్ గౌడ్
పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని స్థానికులకే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు మద్దుల నరేష్ గౌడ్ అన్నారు. గురువారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్లో రైతులకు సంబంధించినటువంటి సమస్యలు గానీ, అభివృద్ధి విషయాలు గానీ స్థానికులకే తెలిసి ఉంటుందని తెలిపారు. అలాగే స్థానికులు అందుబాటులో ఉంటారని, చైర్మన్ పదవి స్థానికులకు ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే విజయరమణారావుకు పత్రిక ద్వారా తెలియజేశారు.