మీ సమస్యల పరిష్కారం కోసం పని చేద్దాం
సిరా న్యూస్,అదిలాబాద్;
ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు ఆ రోడ్డును మూసివేశారు అధికారులు దీంతో ఆ ప్రాంతంలోని దుకాను దారులకు ఉపాది కోల్పోయే పరిస్థితి నెలకొంది. దాదాపు రెండు నెలలపాటు కొనసాగనున్న బ్రిడ్జ్ పనులు శాఖల మద్య సమన్వయలోపం వల్ల ఆలస్యం జరిగే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలోని వ్యాపార నిర్వాకులు ధర్నాకు దిగారు. పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ అక్కడి చేరుకొని వ్యాపారస్థులతో మాట్లాడారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అంతరాయం కలగకుండా చూడాలని వ్యాపార వర్గాలకు విజ్ఞప్తి చేశారు, రైల్వే ట్రాక్ కు అవతల వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి, ఇటు ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర వైపు వెళ్లేందు ఇదే పెద్ద మార్గం నిరంతరం వెల సంఖ్యలో వాహనాల రాకపోకలు నసుస్తుంటాయని వాటివల్ల స్థానికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందు బ్రిడ్జ్ నిర్మాణం తప్పని సరి భవిష్యత్ కాలంలో రైల్వే సర్వీసులు కూడా పెరగనున్నాయి ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుంది కాబట్టి మీరంతా సహకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జరుగుతున్న ఈ పనులలో గత ప్రభుత్వ అలసత్వం కారణంగా ఆలస్యం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులకు సానుకూలంగా ఉంది బ్రిడ్జ్ నిర్మాణ పనులకు భూసేకరణ కోసం నిధుల విడుదల చేయాల్సింది గా కోరాను సంబంధిత శాఖ మంత్రి మరియు ముఖ్య మంత్రి గారు సానుకూలంగా స్పందించారని అన్నారు. రైల్వే మరియు ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి పనులలో ఆలస్యం జరగకుండా నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా చూస్తానని అన్నారు. ధర్నా చేస్తున్న వారిని కలిసిన వారిలో జిల్లా అధికారులు, డి.ఎస్.పి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు..