భీమదేవరపల్లి, సిరా న్యూస్
కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. దీంతో విజిలెన్స్, సివిల్ సప్లయ్, పోలీస్ శాఖ అధికారులు పట్టుకున్నారు. మండలంలోని ముల్కనూరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కా సమాచారంతో తెల్లవారుజామున రెండు గంటలకు పట్టుకునన లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 278 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు తెలసింది.