బూడిద లారీలను నియంత్రించండి

ఇల్లంద గ్రామస్థుల అందోళన
 సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో డస్ట్ లారీలతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఖమ్మం రహదారిపై గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. బూడిద రవాణా లారీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా వందలాది లారీలలో రామగుండం నుండి ఖమ్మం వైపు బొగ్గు బూడిద తరలిస్తున్నారు. ఈ క్రమంలో సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపవడం వల్ల ఆ బూడిద జాతీయ రహదారిపై పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వర్ధన్నపేట మండలం ఇల్లంద జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళన చేశారు బొగ్గు బూడిద కారణంగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని.. వాహనాలు వేగానికి బూడిద కళ్ళల్లో పడి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి బొగ్గు బూడిద రవాణాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల ఆందోళనలతో సుమారు గంటన్నర పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు సర్దు చెప్పి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *