సిరా న్యూస్;
పారిస్ ఒలింపిక్స్ను కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. లింగ అర్హత, డ్రగ్స్, యాంటీ సెక్స్ బెడ్లు, బాక్సింగ్ పాయింట్లు ఇలా ఎన్నో వివాదాలు విశ్వ క్రీడల్లో జరిగాయి. డ్రగ్స్ కొనేందుకు యత్నించిన ఆస్ట్రేలియ హాకీ జట్టు ఆటగాడు టామ్ క్రెయిగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రెయిగ్ను విచారణ కోసం యాంటీ డ్రగ్ విభాగానికి అప్పగించినట్లు పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. ఈ ఘటనపై క్రెయిగ్ క్షణాపణలు చెప్పాడు. తాను ఘోరమైన తప్పు చేశానని… తన చర్యకు పూర్తి బాధ్యత వహిస్తానని తెలిపాడు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఈజిప్టుకు చెందిన 26 ఏళ్ల ఒలింపిక్ రెజ్లర్ మొహమ్మద్ ఇబ్రహీంను అరెస్టు చేసినట్లు ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. మొహమ్మూద్ టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకున్నాడు. పారిస్ కేఫ్ వెలుపల వెనుక నుంచి ఒక మహిళను పట్టుకున్నందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పారిస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. స్వదేశానికి వెళ్లే కొద్ది గంటల ముందు మొహమ్మూద్ ఈ పని చేశాడుఒలింపిక్ విలేజ్ నుంచి అందంగా ఉందన్న కారణంతో పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సోను పంపించేయడం కూడా వివాదం రేపింది. ఆమె అందం కారణంగానే బయటకు పంపిచారనే ప్రచారం జరిగింది. ఆమె అందంతో జట్టులోని ఇతర ఆటగాళ్లను తప్పుదోవ పట్టిస్తోందన్న కారణంతో అలోన్సోను స్వదేశానికి పంపించేశారు. ఆమె పరాగ్వే జట్టులో అనుచితమైన వాతావరణాన్ని సృష్టించిందని పరాగ్వే ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్లో ఓ అథ్లెట్కు ఊహించని విధంగా ఓటమి ఎదురైంది. పురుషుల పోల్ వాల్ట్ ఈవెంట్లో పురుషాంగం తగిలి… ఫ్రెంచ్ అథ్లెట్ ఆంథోనీ అమ్మిరాటికి పతకం చేజారింది. జంప్ చేస్తున్నప్పుడు జననాంగం పోల్కు తగిలడంతో అతను నాలుగో స్తానంలో నిలిచాడు. అయితే ఇదే ఇప్పుడు అంధోనీకి పోర్న్ సినిమాల్లో బోలెడు ఆఫర్లను తెచ్చిపెట్టింది. పోర్న్ సినిమాల్లో నటిస్తే 2, 50,000 డాలర్లు ఇస్తామని కూడా అంథోనీకి ఆఫర్ లెటర్ వచ్చింది. అయితే అతడు దానికి పెద్గగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఈ ఒలింపిక్స్లో లింగ అర్హత వివాదం తీవ్ర కలకలం రేపింది. సాక్షాత్తూ ఇటలీ ప్రధాని మెలోని కూడా దీనిపై స్పందించాల్సి వచ్చింది. మహిళల కుస్తీల్లోకి ఎక్స్, వై క్రోమోజోమ్లు ఉన్న అథ్లెట్లను ఎలా అనుమదిస్తారని చాలామంది ప్రశ్నించారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్ మొత్తం 7 పతకాలు సాధించే అవకాశం ఉన్నా.. కేవలం 6 పతకాలు మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే ఈ ఒలింపిక్స్లో భారత్ మరో 7 పతకాలు సాధించి ఉండేది. కానీ, ఈ పతకాలు తృటిలో మిస్ అయ్యాయి. గల్లంతైన ఆ 7 పతకాల వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.ఈ ఒలింపిక్స్లో మను భాకర్ అద్భుత ప్రదర్శన చేసి 2 కాంస్య పతకాలు సాధించింది. అయితే, మను భాకర్ పతకం సాధించే అవకాశం ఉంది. ఆమె 25 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ పోటీలో పతకం సాధించలేదు. కానీ, తృటిలో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయింది.బ్యాడ్మింటన్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీఫైనల్కు చేరాడు. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కాంస్య పతక మ్యాచ్లో ప్రారంభంలోనే ఆధిక్యం సాధించాడు. ఆపై తన లయను కోల్పోయాడు. 13-21, 21-16, 21-11 తేడాతో మలేషియాకు చెందిన లీ జి జియా చేతిలో ఓడిపోయాడుమహేశ్వరి చౌహాన్, అనంత్లకు షూటింగ్ పోటీల్లో భారత్ తరపున పతకం సాధించే అవకాశం లభించింది. కాంస్య పతక పోరులో రెండు జోడీలు చైనాకు చెందిన జియాంగ్ యుటింగ్, లియు జియాలిన్లతో తలపడ్డాయి. కానీ కేవలం 1 పాయింట్ తేడాతో భారత్ పతకాల ఆశలు అడియాశలయ్యాయి. చివరికి ఈ జంట నాలుగో స్థానంలో నిలిచింది.మహేశ్వరి చౌహాన్, అనంత్లకు షూటింగ్ పోటీల్లో భారత్ తరపున పతకం సాధించే అవకాశం లభించింది. కాంస్య పతక పోరులో రెండు జోడీలు చైనాకు చెందిన జియాంగ్ యుటింగ్, లియు జియాలిన్లతో తలపడ్డాయి. కానీ కేవలం 1 పాయింట్ తేడాతో భారత్ పతకాల ఆశలు అడియాశలయ్యాయి. చివరికి ఈ జంట నాలుగో స్థానంలో నిలిచిందిమిక్స్డ్ ఆర్చరీ టీమ్లో ధీరజ్ బొమ్మదేవర, అంకిత భకత్ భారత్కు ప్రాతినిధ్యం వహించారు. కాంస్య పతక పోరులోనూ ఈ జోడీ ఆడింది. ఈ మీట్లో భారత్కు మరో పతకం వస్తుందని అంతా భావించారు. కానీ, అమెరికాకు చెందిన కేసీ కౌఫోల్డ్, బ్రాడీ ఎలిసన్ 2-6తో ధీరజ్ బొమ్మదేవర, అంకితా భకత్ జోడీని ఓడించి పతకం సాధించాలనే భారత్ కలను నీరుగార్చారు. ఇక్కడ కూడా ఈ భారత జోడీ నాలుగో స్థానం దక్కించుకుంది.భారత షూటర్ అర్జున్ బాబుటాకు కూడా పతకం సాధించే అవకాశం వచ్చింది. అతను 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో కాంస్య పతక మ్యాచ్ ఆడాడు. అయితే, క్రొయేషియా ఆటగాడు మారిసిక్ మిరాన్ చేతిలో అర్జున్ ఓడిపోయాడు. దీంతో భారత్ మరో పతకం సాధించాలన్న కల చెదిరిపోయింది.భారత స్టార్ మహిళా అథ్లెట్ మీరాబాయి చాను నుంచి దేశంలోని కోట్లాది మంది క్రీడాభిమానులు పతకం ఆశించారు. టోక్యో ఒలింపిక్స్లో మీరాబాయి చాను రజత పతకం సాధించింది. ఆమె నుంచి ఈసారి బంగారు పతకం ఆశించారు. అయితే, కేవలం 1 కేజీతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందిమహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ ఫైనల్ చేరింది. అయితే, ఫైనల్స్కు ముందు బరువు పెరగడంతో ఆమె అనర్హురాలైంది. ఈ ఘటన జరిగి ఉండకపోతే భారత్కు బంగారు పతకం లేదా రజత పతకం వచ్చి ఉండేదిఇమానే ఖలీఫ్ ఉదంతం అయితే కొన్నిరోజులపాటు క్రీడా ప్రపంచాన్ని ఊపేసింది. ఒలింపిక్ ఆరంభ వేడుకల్లో లాస్ట్ సప్పర్ పేరడిపైనా వివాదం చెలరేగింది. ట్రంప్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఒలింపిక్ నిర్వహణ కమిటీ క్షమాపణలు కూడా చెప్పింది