సిరా న్యూస్,మడకశిర –
మడకశిర పట్టణం, అంబేద్కర్ సర్కిల్ లో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆధ్వర్యంలో సాక్షి దినపత్రికను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రోజు మాట్లాడుతూ ఈరోజు సాక్షి పత్రికలో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులో 17 గురు ఎమ్మెల్యేలు అంటూ ఓ కథనం ప్రచురితం చేశారు. అందులో 16వ సభ్యునిగా తన పేరు రాశారని, సాక్షి పత్రిక అసత్య ప్రచారాలు, అబద్ధాలు ప్రచురించడంలో దిట్ట అని, వార్త రాసే ముందు పూర్వపరాలు పరిశీలించి రాయాలని అన్నారు. నిజంగా మీరు రాసిన కథనానికి తీసుకు నాకు సంబంధం ఉంటే నైతిక బాధ్యతగా మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. అది అబద్ధమని నేను రుజువు చేస్తే మీరు మీ సాక్షి ఛానల్ సాక్షి దినపత్రికను నిలిపి వేస్తారా అంటూ సాక్షి యాజమాన్యం పై మండిపడ్డారు.
నా మీద ఉన్నటువంటి కేసులు 55 అని,, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీల మీద మహిళలపై దాడులను ఖండిస్తూ నేను చేసిన పోరాటంలో 55 కేసులు నాపైన పెట్టించారని అన్నారు. సాక్షి దినపత్రిక సబ్ ఎడిటర్లు ఎడిటర్లు, వార్త రాసే ముందు పూర్వపరాళ్ళు క్లియర్ గా పరిశీలించి రాయాలని తనపై అసత్య ప్రచారాలు వ్రాసినటువంటి సాక్షి దినపత్రికకు సంబంధించిన యాజమాన్యంపై లీగల్ గా నోటీసులు పంపిస్తున్నానని అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎవరు కూడా సాక్షి దినపత్రికను కొనవద్దని చదవద్దని అసత్య ప్రచారాలను చూడవద్దని కార్యకర్తలు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కలిసి అంబేద్కర్ సర్కిల్లో సాక్షి దినపత్రికలను తగలబెట్టి సాక్షి దినపత్రిక డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు…