సిరా న్యూస్,వేములవాడ;
రాజన్న సిరిసిల్ల జిల్లా బహిరంగ ప్రదేశంలో మహిళలు టాయిలెట్ వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో సంవత్సరం క్రితం ఆర్భాటంగా ప్రారంభించిన మహిళల బయో టాయిలెట్, మెయింటెనెన్స్ చేసేవారు లేక మూలన పడి ఉన్న వైనం జిల్లాలో చోటుచేసుకుంది. వేములవాడలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అప్పటి జిల్లా మాజీ మంత్రి కేటీఆర్ గత సంవత్సరం క్రితం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చేశారు. అందులో భాగంగా మున్సిపల్ నిధుల తో ఐదు లక్షలు తో ఆర్టీసీ బస్సు ను కొనుగోలు చేసి షి మొబైల్ బయో టాయిలెట్ బస్సును తయారు చేసారు. ఆ బయో టాయిలెట్ బస్సును మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా బయో టాయిలెట్ బస్సు ఇంతవరకు వినియోగంలోకి రాకపోగా వేములవాడ ఆర్టీసీ డిపోలో ఓ మూలకు నిరుపయోగంగా పడి వుంది. బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజన్న భక్తులకు ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తున్నమని కేటీఆర్ స్వయంగా ప్రకటించినప్పటికీ, టాయిలెట్ బస్సు వినియోగం లోకి రాకపోవడంపై పాలవర్గం మున్సిపల్ అధికారుల పై భక్తులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు షీ టాయిలెట్ బస్సును భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.