సిరాన్యూస్, బోథ్
పుట్టిన రోజు మొక్కలు నాటుదాం: కరెస్పాండెంట్ కార్తీక్
* మొక్కనాటిన విద్యార్థి ఆశిక్ అలీ
పుట్టిన రోజు మొక్కలు నాటుదామని యూటర్న్ పాఠశాల కరస్పాండెంట్ ఉసికెల కార్తీక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని దన్నూర్(బి) గ్రామానికి చెందిన పాత్రికేయుడు షేక్ అలీ పెద్ద కుమారుడు ఆశిక్ అలీ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం విద్యార్థి చదువుతున్న మండలంలోని స్థానిక యూటర్న్ పాఠశాల లో పిల్లాడి చేత స్కూల్ కరస్పాండెంట్ ఉసికెల కార్తీక్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ అల్లం సాయి కృష్ణ మార్గదర్శకంలో విద్యార్థి చేత మొక్కలను నాటించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కార్తీక్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలా తమ పుట్టినరోజులను నాడు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం అనేది చాలా గొప్ప కార్యక్రమమని ఒక గొప్పసందేశం అన్నారు. ఇది ఒక వినూత్న కార్యక్రమాన్ని సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. దీనితో మొక్కలు నాటడం వల్ల పర్యావరణం సస్యశ్యామలం అవుతుందని సమతుల్యత ఏర్పాడి, గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించిన వారం అవుతామని, ప్రకృతికి ఎంతో మేలు జరిగి, మానవ మనుగడజీవకోటి కి ఎంతగానో చెట్లు దోహదం చేస్తాయని తెలిపారు. అలాగే చెట్లను కాపాడడం ద్వారా విద్యార్థుల మానసిక పరిపక్వతను ప్రశాంతతను ఎంతగానో ఉపయోగపడి చదువులకు కూడా ప్రయోజన కారిగా అవుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంలో భాగస్వాములు కావాలని చెట్లు భూమి తల్లికి ఒక ఊపిరి అవ్వాలని పుడమి తల్లి పచ్చదనంతో మురిసిపోవాలని ప్రాణకోటికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రకృతి అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అల్లం సాయి కృష్ణ , ఉపాధ్యాయులు గురుమూర్తి, రవితేజ, ప్రకృతి ప్రేమికుడు షేక్ అలీ, టీచర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.