సిరా న్యూస్,సికింద్రాబాద్;
సమాజానికి హాని కలిగించే విధమైన చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఓయూ ఏసీపీ జగన్ హెచ్చరించారు. మంగళవారం లాలాగూడ పోలీస్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం, లాలాగూడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ జగన్ మాట్లాడుతూ నగరంలో నేరాల నియంత్రణకు సీపీ ఆదేశాల మేరకు పగలు రాత్రి అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో నిఘా పెంచినట్లు తెలిపారు. అర్థరాత్రుల్లో అనవసరంగా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా 11 గంటల తరువాత దుకాణాలు మూసివేయాలని, లేదంటే కేసులు నమోదు చేయాల్సి వస్తుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రస్తకే లేదన్నారు.
===