సిరా న్యూస్, ఆదిలాబాద్:
సంకల్ప సభ కాదు… ముమ్మాటికి ఓట్ల సభ
– జోగు రామన్న హాట్ కామెంట్స్
విజయ సంకల్ప సభ పేరిట ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ లో నిర్వహించింది ముమ్మాటికి ఓట్ల సభేనని… మాజీ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న కామెంట్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. గంపెడు ఆశలతో ఉన్న ఆదిలాబాద్ ప్రజలను మోడీ పర్యటన తీవ్రంగా నిరాశపరచందని అన్నారు. సిసిఐ పరిశ్రమ, అదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్, ఆదిలాబాద్ లో విమానాశ్రయ ఏర్పాటు, టెక్స్టైల్ పార్క్ నిర్మాణం, తదితర అంశాల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. దీర్ఘకాలికంగా ఆదిలాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించకుండా, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఆయన ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ సభ నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.