రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

సిరా న్యూస్,విజయవాడ;
కృష్ణాజిల్లా ఘంటసాల మండలం లంకపల్లి వద్ద 216 జాతీయ రహదారిపై తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ముందు ఆగివున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. స్కూటీ పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతులు చల్లపల్లి మండలం పచ్ఛర్లంక గ్రామానికి చెందిన దాసరి నాగేశ్వరరావు (70) దాసరి బేబీ సరోజినీ (60) లుగా గుర్తించారు.
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *