గోపవరం మండలంలోని వివిధ గ్రామాల నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ ధర్నా

సిరా న్యూస్,బద్వేలు;
గోపవరంలోని పలు గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలు తీవ్ర అవస్థలు పడుతున్నారని జగనన్న కాలనీలో కూడా వీరికి ఇవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అందుకే గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) గోపవరం మండల సమితి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ…. ప్రతి గ్రామంలో ఒక్కొక్క ఇంటిలో ఇద్దరు ముగ్గురు కాపురాలు ఉండలేక సొంత ఇల్లు కావాలని అడిగితే కొంతమందికి మాత్రమే జగనన్న కాలనీలలో ఒకటిన్నర సెంటు ఇచ్చారని మిగిలిన వారికి ఇవ్వాలని అనేక తపాలుగా ఆందోళన భూ పోరాటం చేసినప్పటికీ ఆర్డిఓ గారు కూడా గతంలో పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదని తక్షణం పి.పి కుంట వద్ద సర్వే నెంబర్ 15 57 నందు ప్రభుత్వ భూమి కలదని అందులో పేదవారికి అందరికీ మూడు సెంట్లు ఇంటి స్థలం చొప్పున ఇవ్వాలని అదేవిధంగా అర్హులైన పేదవారికి మూడు ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిని మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు గోపవరం మండలంలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కొంతమంది భూకబ్జాదారులు అధికార పార్టీ నాయకులు కన్నేసి సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వ భూములు పరిరక్షించడంలో అధికారులు విఫలం చెందుతున్నారని పేదవాడు మూడు సెంట్లు ఎన్ని స్థలం అడిగితే ఇవ్వడం తమ బాధ్యత కాదునట్లు అధికారులు వివరిస్తున్నారని పేదలే ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో గుర్తించి గుడిసెలు వేసుకుంటే అధికారులు ఆగమేఘాల మీద వచ్చి వాటిని తొలగించడం నాయకులపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని మండలంలో అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం ఇవ్వకపోతే త్వరలోనే ప్రజలందరినీ ఐక్యం చేసి ఎర్రజెండా నీడలో భూ పోరాటం నిర్వహించి ప్రతి కుటుంబానికి మూడు సెంట్లు స్థలం పంచుతామని ఆయన తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదల పట్ల దయవుంచి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం డిప్యూటీ తాసిల్దార్ మోహన్ రాజు, ఆర్ ఐ అమర్నాథ్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి (DHPS) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పడిగే వెంకటరమణ, సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి చంద్రమోహన్ రాజు, మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య, ఏరియా కార్యవర్గ సభ్యులు బాలు పీవీ రమణ, వ్యవసాయ కార్మిక సంఘం గోపవరం మండల నాయకులు షేక్ ఖాదర్ భాష, ఆకా చంద్రశేఖర్, ట్యాంక్ మస్తాన్, మాబూ, పెంచలయ్య డి హెచ్ పి ఎస్ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మునిరత్నం ,రమణ యువజన సంఘం నాయకులు బొడ్డు చిన్న తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *