cpi Gopal: శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి

సిరాన్యూస్, కళ్యాణదుర్గం
 శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి
* వైసిపి పాల‌న‌లో అభివృద్ధి శూన్యం
* సొంత డబ్బా కొట్టుకోవడానికి బహిరంగ సభ
* సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లనే ఆంధ్ర‌జ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ కార్యకర్తలు మూక దాడికి పాల్పడ్డారని, దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు.  సోమ‌వారం ముదిగల్లు రోడ్డులోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి నరసింహులు పట్టణ కార్యదర్శి ఓంకార్ సిపిఐ నాయకులు తిమ్మరాయుడుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మీడియా ప్రతినిధులతో పాటు అన్ని వర్గాల పైన నిత్యం దాడులు జరుగుతున్నాయన్నారు. ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది అన్నారు. వందలాదిమంది పోలీసులు ఉన్న దాడిని అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. దాడి జరిగిన శ్రీకృష్ణుని పోలీసులు హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ కు తరలించడం దుర్మార్గమని, పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి ప్రవేట్ సైన్యం లా వ్యవహరిస్తున్నరని వారు విమర్శించారు. దాడి చేసినవారి వీడియోలు స్పష్టంగా ఉన్నాయి అని పోలీసులు వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. వైసిపి ప్రభుత్వం లో జిల్లాలో అభివృద్ధి శూన్యమని, హంద్రీనీవా ఒక్క అడుగు కదల లేదని, తుంగభద్ర కాలువ ఆధునికరణకు, సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా ఖర్చు పెట్టు లేదన్నారు. సీఎం ప్రసంగం అంతా ప్రతిపక్షాలను తిట్టడానికి వైసీపీ కార్యకర్తలను రేచ్చగొట్టడానికి సరిపోయింది అన్నారు. విభజన హామీల పై మాట్లాడే దమ్ము లేదన్నారు. ప్రత్యేక హోదా వెనుకబడిన రాయలసీమ కు నిధులు, పోలవరం, రాజధాని, ప్రాజెక్టు అనంత, కుద్రేముఖ్ ఉక్కు ఫ్యాక్టరీ,  సాధిస్తాం అన్న హామీలు తుంగలో తొక్కి వాటి గురించి మాట్లాడకుండా సొంత డబ్బా కొట్టుకోవడానికి బహిరంగ సభ నిర్వహించారని వారు ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *