CPI Lakshmana: కుందుర్పి గ్రామ సీపీఐ సీనియర్ నాయకుడు పి. లక్ష్మన్న మృతి

సిరాన్యూస్, కుందుర్పి
కుందుర్పి గ్రామ సీపీఐ సీనియర్ నాయకుడు పి. లక్ష్మన్న మృతి

కుందుర్పి మండలంలోని కుందుర్పి గ్రామానికి చెందిన కళ్యాణదుర్గం తాలూకా సిపిఐ సీనియర్ నాయకుడు, విశ్రాంతి ప్రధానో పాధ్యాయుడు పి. లక్ష్మన్న (96) శుక్ర‌వారం గృహంలో మృతి చెందారు. ఆయన గ‌త నెల‌లుగా అనారోగ్యానికి గురై మంచానకే పరిమిత‌మ‌య్యారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు , ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఎస్టీయూ ,యూనియన్, ఉపాధ్యాయులు, సీపీఐ నాయకులు, గ్రామ ప్రజలు సందర్శించి ల‌క్ష్మ‌న్న మృత‌దేహానికి భౌతికాయం పైన భౌతికాయానికి పూలమాల‌లు వేసి ఘన నివాళులర్పించారు. మృతుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని వారు ప్రార్థించారు. ఆయన సీపీఐ పార్టీకి, ఉపాధ్యాయులకు, చేసిన‌ సేవలు చిరస్మరణీయం అని వక్తలు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *