CPI Meeting: బీజేపీని అధికారంలోకి రానివ్వొద్దు

బేల, సిరాన్యూస్

బీజేపీని అధికారంలోకి రానివ్వొద్దు

దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వొద్దని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి కోరారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో జరిగిన సీపీఐ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో పదేళ్లు దేశం వెనకకు పోయిందని గుర్తు చేశారు. పెత్తందారులకు కొమ్ము కాస్తూ పేదవాడిని నట్టేట ముంచుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, నిరుద్యోగులు, యువతను నిర్వీర్యం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు, సీపీఐ నాయకులు స్వామి, షరీఫ్, అశోక్, వెంకట్, రామన్న పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *