CPIML Sunarikari Rajesh: పోడు భూములకు పట్టాలివ్వాలి : సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
పోడు భూములకు పట్టాలివ్వాలి : సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్
* కలెక్టర్ కు వినతిపత్రం అంద‌జేత‌

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖానాపూర్‌ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ అన్నారు. మంగ‌ళ‌వారం సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మ‌ల్ జాయింట్ కలెక్టర్‌కి వినతి పత్రం అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునకరి రాజేష్ మాట్లాడారు. ఖానాపూర్ మండలంలోని ఎక్బాల్ పూర్ గ్రామంలో గత 30 సంవత్సరాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని సర్వేలు ప్రారంభించారని చెప్పారు. అప్పుడు గ్రామం లో సాగు చేస్తున్న భూములను సర్వే చేశారు కానీ గ్రామం ప్రభుత్వపరంగా ఆన్లైన్లో లేకపోవడం వలన గత ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. అందువలన పోడు సాగుదారులు నష్టపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ గ్రామానికి పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. స‌మావేశంలో డివిజన్ నాయకులు దుర్గం లింగన్న, ఐఎఫ్టియు నాయకులు ముంజ దేవేందర్, మాలావత్ జే, గోవింద్, గోపీచంద్, గుగ్లావత్ గౌను, లావుడ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *