పెంబి, సిరా న్యూస్
క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన దాస్తురాబాద్
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని సోమవారం పెండాల సురేష్ స్మారక క్రికెట్ పోటీలు గత పది రోజుల నుంచి జరుగుతున్నాయి. నేటితో పోటీలు ముగిశాయి. ఈ పోటీలో విజేతగా దాస్తురాబాద్, రన్నర్ గా పెంబి జట్లు గెలుపొందాయి. గెలిచిన జట్ల కు మొదటి బహుమతిగా రూ. 20వేలు, రెండవ బహుమతిగా రూ. 10 వేలను నిర్వాహకులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమం లో సర్పంచ్ పూర్ణ చందర్ గౌడ్, ఉప సర్పంచ్ స్వప్నిల్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎస్ బీఐ సిబ్బంది అంబేద్కర్ , ప్రవీణ్ గౌడ్,కో ఆప్షన్ మతీన్, పెండల నరేష్, ఇస్మాయిల్, సంతోష్, అశోక్, చిట్టీ, శారు, మహేందర్, గణేష్, సురేష్ ఉన్నారు.