కిటకిటలాడిన శివాలయాలు

సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం త్రయోదశి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పాప హరేశ్వర ఆలయం, గోదావరి తీరంలోని శ్రీ దశరథ మహారాజు వరలక్ష్మి ఆశ్రమం సమీపంలోని శ్రీ సుర్యేశ్వర ఆలయాలకు తెల్లవారుజాము నుంచే ఆలయాల ముందు భక్తులు బారులు తీరారు. వేకువజామున శివుడికి బిల్వార్చన పూజ,అభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలు,నీటి పందిళ్లు, ప్రసాదాలు,మంచినీరు, ఏర్పాటు చేశారు అధికారులు.భక్తులు తెలంగాణ, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్ నుండి తరలివచ్చి భక్తులు వేకువజామున పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనంతో పాటు శివాలయాలను సందర్శించి భక్తులు హర హర మహాదేవ అంటూ శివనామస్మరణతో బాసర క్షేత్రం మార్మోగింది. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి భక్తులను ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *