సిరా న్యూస్,కుప్పం;
త్రి కూడలి సరిహద్దు ప్రాంతంలో ఉన్న గుడివంక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ వినాసాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఆడికృతిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం నుండి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కుప్పం నుండి గుడివంకకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసారు.