సిరాన్యూస్, కుందుర్పి
మహనీయుల విగ్రహాలను తొలగించడం సరికాదు: ఎస్సీ,ఎస్టీ జేఏసీ మండల అధ్యక్షుడు డాబా రమేష్
* అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన
పార్లమెంట్ భవనంలోని మహనీయుల విగ్రహాలను సుందరీకరణ పేరుతో తొలగించడం సరికాదని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ మండల అధ్యక్షుడు డాబా రమేష్ పేర్కొన్నారు. కంబదూరు మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా డాబా రమేష్ మాట్లాడుతూ పార్లమెంట్ భవన్ గ్రంథాలయం సమీపంలోని లాన్ లో ఇప్పటికే గిరిజన బిర్సా ముండా, మహారాజ ప్రతాప్ లాంటి ఎందరో విగ్రహాలు ఉన్నాయని, వాటి పక్కనే ఉన్నమహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, చత్రపతి శివాజీ విగ్రహాలను మాత్రమే మార్చాలనుకోవడం సరైనది కాదన్నారు.ఇప్పటికే విపక్షాలు సైతం వ్యతిరేకించడం సంతోషకరమన్నారు. గతంలో ఢిల్లీలో సంత్ రవి గురుదాస్ మందిరాన్ని కూలగొట్టారని, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేసి మందిరాన్ని నెలకొల్పే విధంగా పోరాటాలు చేశారని తెలిపారు.