Dairy Industry Conference : ఈనెల 4 నుంచి ఆరు వరకు డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్

సిరా న్యూస్,హైదరాబాద్;
50వ డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ను వచ్చేనెల 4 నుంచి 6 తేది వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు ఇండియన్ డైరీ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సతీష్ తెలిపారు. సోమయ్య గూడ ప్రెస్క్లబ్లో ఇందుకు సంబంధించిన బ్రోచర్లను అసోసియేషన్ ప్రతినిధులు రాజేశ్వరరావు బివికే రెడ్డి లతో కలిసి ఆవిష్కరించారు. మూడు రోజులపాటు కొనసాగి ఈ సదస్సు కు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. సుమారు 2500 మంది దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో హాజరవుతారని అన్నారు. పాడి పరిశ్రమ రంగంలో వస్తున్న మార్పులను పాడి రైతులకు వివరించేందుకు ఈ సదస్సు ఎంతగా దోహదపడుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *