Danakunta:శిథిలావ‌స్థ‌లో దానకుంట బ్రిడ్జి

సిరాన్యూస్‌, ఓదెల
శిథిలావ‌స్థ‌లో దానకుంట బ్రిడ్జి
* ఆందోళ‌న‌లో ప్ర‌యాణికులు

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో దానకుంట చెరువుపై పురాతనమైన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. ప్రతిరోజు సుల్తాన్ బాద్ నుండి జమ్మికుంటకు వెళ్లే బస్సులు బ్రిడ్జిపై వెళ్తున్నా యి. డబుల్ రోడ్డు కావడంతో వాహనాలు ఎక్కువ గా బ్రిడ్జిపై ప్రమాదకరంగా నడుస్తున్నాయి. ఏ క్షణానా ఏమవుతుందో అని ప్రయాణికులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని దానకుంట చెరువుపై కొత్త బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *