రెవెన్యూ శాఖలో దళారుల దందా

సిరా న్యూస్,నల్గోండ;
రెవెన్యూ శాఖలో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం నియమించుకున్న కాంట్రాక్టు సిబ్బంది కాదు… ఏళ్ళ తరబడి రికార్డు గదిని పట్టుకొని కాలం గడుపుతున్న నియంతలు.. అధికారులను మచ్చిక చేసుకొని జేబులు నింపుతూ తాము నింపుకుంటున్న వైనం. ఇదంతా చేస్తున్నది అధికారులనుకుంటే పోరపాటే మరి..ఇదంతా రెవెన్యూ శాఖలో ఓ ఇద్దరు వ్యక్తులు సాగిస్తున్న వసూళ్ళ దందా. ఏదైనా పని మీద కార్యాలయం లోపలికి వెళుతుంటే అడ్డుకునే పరిస్థితిలో ఈ కార్యాలయంలో ఓ ప్రైవేటు వ్యక్తులు ఏకంగా ఇరవై ఏళ్ళుగా రాజ్యమేలుతున్నారు. సామన్య ప్రజలను పట్టి పీడిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇది నల్గొండ జిల్లాలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ మిర్యాలగూడ మండల రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న ప్రైవేట్ వ్యక్తుల పాలన. మిర్యాలగూడ తహసీల్ధార్ కార్యాలయంలో వెంకట్ రెడ్డి అనే ప్రైవేట్ వ్యక్తి అతి విలువైన రికార్డు గదిలో యధేచ్చగా విధులు నిర్వహిస్తున్నాడు. జూనియర్ అసిస్టెంట్ నుంచి తహసీల్ధార్ వరకు ఎంతో మంది అధికారులు మారిన ఇతను మాత్రం రికార్డులు భద్రపరిచిన గదిని వదలకుండా దందా సాగిస్తున్నాడు. పట్టణ, మండల పరిధిలో భూముల ధరలు పెరగడం, ధరణిలో లోటుపాట్లను ఆసరాగా చేసుకొని ఆ వ్యక్తి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు. రికార్డులపై అవగాహన పెంచుకున్న ఆయన అధికారులను మచ్చిక చేసుకొని దందా చేస్తున్నాడు.కార్యాలయంలో పహణీ నకలు కోసం ధరఖాస్తులు భారీ సంఖ్యలోనే వస్తుంటాయి. అయితే వాటి పహాణిలు, అమెండ్‌మెంట్ రికార్డుల నఖలకు రూ. 500 నుంచి రూ. 5000 వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలున్నాయి. వసూలు చేస్తున్న దందాలో అధికారులకు కూడా పాలుపంచుతుండటం వల్ల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అధికారి స్థాయిని బట్టి వసూలు చేసిన డబ్బులను పంపకాలు చేయడం అలవాటుగా చేసుకొని అధికారులు మెప్పు కూడా పొందుతున్నాడుమండల తహసీల్దార్ కార్యాలయంలో వెంకట్ రెడ్డితో పాటు మరో వ్యక్తి కూడా దందా చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి.ఇద్దరు కూడా గత 20 ఏళ్లుగా ఇక్కడే ఉండి దందా నడిపిస్తున్నారు. ఒకరు రికార్డు గదికి పరిమితమైతే మరొకరు కుల, ఆదాయ, పహణీ, పుట్టిన తేది సర్టిఫికే‌ట్‌లు, భూమిల మార్పడి వంటివి చేస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడు. ఈ ఇద్దరి వ్యవహరంపైనే ఉన్నతస్థాయి అధికారులు హెచ్చరించిన తీరు మార్చుకోలేదని విమర్శలు ఉన్నాయి. అనధికారికంగా రికార్డు గదిలో విధులు నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న సదరు వ్యక్తి పై గతంలో ఉన్నతాధికారులు హెచ్చరించారు. గతంలో ఇక్కడ పని చేసి బదిలీపై వెళ్లిన డివిజన్ స్థాయి అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఆ సమయంలో పోలీస్ స్టేషన్‌లో ఈ ప్రవేట్ వ్యక్తులు ఇద్దరు కార్యాలయంలోకి వెళ్లితే రూ.50 వేల జరిమానా విధించాలని బాండ్ పేపర్ మీద హమీ పత్రం రాసిచ్చిన ట్లు తెలిసింది. ఇటు రెవెన్యూ , అటు పోలీస్ అధికారుల చర్యలు లేకపోవడంతో దందా మళ్లీ మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. పేరుకే జూనియర్ అసిస్టెంట్‌ : ఈ కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ పేరుకు మాత్రమేనని ప్రజలు పేర్కొన్నారు. దందా సాగిస్తున్న వ్యక్తులు జూనియర్ అసిస్టెంట్‌ను లెక్క చేయకుండా రికార్డు భద్రపరచిన గది ఇష్టానుసారంగా వినియోగించుకుంటారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పహణి, అమెండ్‌మెంట్ రికార్ఢులు సైతం ఆ దళారులెేకే అప్పగిస్తుండటం గమనర్హం. దీంతో రికార్డుల భద్రతపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వసూళ్లులో ఈ దళారులు యుపీఐ కార్డుల ద్వారా కూడా సొమ్ము చెల్లించుకుంటున్నారు. రోజుకు వీరి ఆదాయం ఐదు వేల నుంచి పదివేల వరకు ఉంటుందని ప్రచారం. ఇంత తతంగం కళ్ల ముందు జరుగుతున్న ఏమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో దళారుల వసూళ్ళలో అధికారులకు భాగస్వామ్యం ఉందనడంలో సందేహం లేదని ఆరోపణలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *