సిరా న్యూస్,తాడేపల్లి గూడెం;
దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇస్రో నిర్వహించే యువ శాస్త్రవేత్త కార్యక్రమానికి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,దండగర్ర విద్యార్థిని మరపట్ల రత్నకుమారి (9వ తరగతి) ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సిహెచ్.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఇస్రో యువికా 2024 కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం 1,50,000 మంది దీనికి అప్లై చేయగా ఇస్రో వారిలో 350 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. మే 12 నుండి 25 వరకు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాఖ) జరిగే శిక్షణ కార్యక్రమానికి రత్నకుమారి హాజరుకానుంది.అంతరిక్ష విజ్ఞానము సాంకేతికత మోడల్ రాకెట్ మొదలైన ప్రయోగాలపై నమూనాలు తయారు చేయడం,శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం,రిమోట్ సెన్సింగ్, డీప్ స్పేస్ నెట్వర్క్, రేడియో టెలిమెట్రీ ట్రాకింగ్ , స్పేస్ ప్రోబ్స్, రోవర్లు, లాండర్లపై అవగాహన, గ్రహాల మినరాలజీ మ్యాపింగ్ మొదలైన వాటిపై శిక్షణ తీసుకోనుంది. రత్నకుమారి ఎంపికపై ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, పాఠశాల తల్లిదండ్రులు కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ పిల్ల రాంబాబుసంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదిగి మన దేశానికి ఇస్రోకే సేవ చేయాలని తెలియజేశారు.
===================