సిరాన్యూస్, ఓదెల
మోసపోతే… గోసపడతాం : మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించండి
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఓదెల మండలం గుండ్లపల్లి, కనగర్తి,మడక, శానగొండ గుంపుల గ్రామాలలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు . కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో నే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి ఆయకట్టు వరకు రెండు పంటలకు సాగునీరు అందించి పంటలను కాపాడినామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారన్నారు. గ్యారంటీల పేరు తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గంట రాములు, మండల పార్టీ అధ్యక్షులు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ జీల తిరుపతి, మాజీ కోపరేటివ్ బ్యాంక్ ఛైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మ్యాడగొని శ్రీకాంత్ ఎంపీటీసీ లు ఆరెల్లి సరోజన మొండయ్య,నోముల పద్మావతి ఇంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ పులుగు తిరుపతి రెడ్డి,తిప్పారపు చిరంజీవి,ఉప్పుల సంపత్ గుంటి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు కొట్టె మహేందర్, రావుల స్వామి, గొర్ల కుమార్, మడ్డి శ్రీనివాస్, రంగు రాజు,నాయకులు రాయిల్ల రాజేశం, కృష్ణారెడ్డి,వేల్పుల సది , చదువు శ్రీనివాస్ రెడ్డి,పులుగు నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి వెంకట్ రెడ్డి, బుచ్చిరెడ్డి, దాసరి కుమార్, మాజీ ఉప సర్పంచ్ గాండ్ల ఐలయ్య, పోచమల్లు, పిట్టల సారయ్య, రాపోలు తిరుపతి, బండ రాజు, మద్దికుంట తిరుపతి,ఎండి ఖలీల్, జంగోని వెంకటేష్, ఆవుల రవీందర్, నరసింహా రెడ్డి, జగదీశ్వర్, రంగు రంజిత్, వేపూరి శ్రీనివాస్,రాజు, సది,పత్తి సుధాకర్ రెడ్డి, అశోక్, పెరుమాండ్ల రాజు, జీల రమేష్,బొమ్మక నరేష్,బొమ్మ ప్రభాకర్, ఇనుముల గణేష్, గంధం వినోద్, గంధం బుచ్చయ్య, బొమ్మక ప్రభాకర్, శివాజీ, విక్రమ్, లింగయ్య, సాగర్ల లింగయ్య,బొమ్మక ప్రభాకర్, సంపత్ ,బిపాషా,నరేష్, కేశవరెడ్డి, రాజకొమురయ్య, శ్రీధర్, గణేష్,గాదం గిరిబాబు,శ్యామల శంకర్, హైదరెల్లి,కొయ్యడ వెంకటమల్లు ,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.