సిరాన్యూస్, చిగురుమామిడి
అన్నదాతలు ఆందోళన చెందొద్దు : డీసీసీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పొన్నం ఆదేశం
* రైతులకు ప్రభుత్వం అండగా
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని, సర్కార్ అండగా ఉంటుందని డీసీసీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత తెలిపారు. శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలపై మంత్రి పొన్నం ఆరా తీసినట్లు ఆయన తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ఎటువంటి తాలు లేకుండా కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ఎక్కడ కూడా నష్టపోకుండా దాన్యం కొనుగోలు వేగవంతం అవుతుందని తెలిపారు. మంత్రి పొన్నం అమెరికా పర్యటన ఉన్నప్పటికీ ఇక్కడ పడుతున్న వర్షాలతో ప్రజలకు ఏమి నష్టం జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని వివరించారు. రైతులెవరు అధైర్యపడవద్దు అని… ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే ఆ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరు ఆందోళన చేందొద్దు అని ఆయన భరోసా కల్పించారు.