Dasari Usha: సత్యాగ్రహ దీక్ష చేప‌ట్టిన‌ బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష

సిరాన్యూస్‌, ఓదెల
సత్యాగ్రహ దీక్ష చేప‌ట్టిన‌ బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష

నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషాను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడంతో శుక్ర‌వారం పెద్దపల్లి జిల్లా కేంద్రం శాంతిన‌గ‌ర్‌లో ఇంట్లోనే ఆమె సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈసంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే త్వరలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ గ్రూప్స్‌ ఉద్యోగాలు పెంచాలని అడిగింద‌ని, మరి ఇప్పుడు ఎందుకు పోస్టులు పెంచడం లేద‌ని నిల‌దీశారు.గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1:100 విధానం అమలు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ఉపముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం యుతను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసంద‌ర్బంగా మాదిగ శక్తి సామాజిక వర్గం నుండి బొంకూరి సన్నీమద్దతుగా నిలిచారు. ఈకార్య‌క్ర‌మంలో బీఆర్ ఎస్ కౌన్సిలర్లు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *