సిరాన్యూస్, ఓదెల
జాన్ వెస్లీ కుటుంబానికి న్యాయం చేయాలి: బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష
* జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత
జాన్ వెస్లీ కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష అన్నారు. గురువారం పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి ప్రతం అందజేశారు. ఈసందర్బంగా దాసరి ఉష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రమాదానికి గురై సెప్టిక్ ట్యాంక్ సంపులో పడి మృతి చెందిన జాన్ వెస్లీ కుటుంబానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించా లన్నారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు పారిశుద్ధ నిర్వహణ, కరెంటు లాంటి పనులు తక్షణమే చేపట్టాలని తెలిపారు.డాక్టర్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జాన్ వెస్లీ మృతి చెందాడని, మృతుని కుటుంబానికి నష్టపరిహారంగా పది లక్షల రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేయించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి కౌన్సిలర్లు వీరబోయిన శ్రీనివాస్, రెల్లి స్వామి, చిన్నకల్వల ఎంపీటీసీ గుర్రం సంపత్, ఎండి ఖదీర్, మాదిగ శక్తి జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి రవి, నాయకులు తాళ్లపల్లి అంజయ్య, సాయి, వంశీ, పల్లె రాకేష్ ,పందిళ్ళ యూత్ అధ్యక్షుడు దరుముల రవి,కొత్తూరు రాజు, ఇల్లందుల ప్రశాంత్, ఇల్లందుల రాజకుమార్,తదితరులు ఉన్నారు.