dattanikam: 17 ఎంపీలను గెలిపించే దిశగా పనిచేయాలి

సిరా న్యూస్, బేల‌
17 ఎంపీలను గెలిపించే దిశగా పనిచేయాలి
* బీజేపీ మండల అధ్యక్షుడు దత్తనికం
* మహాసభకు బయలుదేరిన బీజేపీ కార్యకర్తలు
ప్రతి బిజెపి కార్యకర్త వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 ఎంపీలను గెలిపించే దిశగా పనిచేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు దత్తనికం అన్నారు. అదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రం నుండి దహేగావ్, పాఠన్, గూడా, మనియాపూర్, ఖోగ్దూర్, బేలా నుండి బిజెపి కార్యకర్తలు, యువకులు విజయ సంకల్ప సమ్మేళనానికి బ‌య‌లుదేరారు.ఈ సంద‌ర్బంగా బేలా మండల అధ్యక్షుడు దత్తనికం మాట్లాడారు. భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పూర్తి సహకారం అందించిన ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయ‌ల్ శంక‌ర్‌కు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమానికి 41 వ బూత్ సభ్యులు , సంజయ్ కాడే, సందీప్ ఠాక్రే, రాము బర్కాడే, సాదిక్, మహేష్, శివకుమార్, గణేష్, బి జే ఎం, అధ్యక్షుడు నవీన్ పోత్రాజ్ మొత్తం 60 మంది కార్యకర్తలు తరలి వెళ్లారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *