సిరా న్యూస్, గుడిహత్నూర్
అవకాశం ఇస్తే బారిలో ఉంటా
* మండల నాయకులను కలిసిన కోవ దౌలత్ రావు మొకాశి
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బారిలో ఉంటానని ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆశావహ అభ్యర్థి కోవ దౌలత్ రావు మొకాశి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గుడిహత్నూర్ మండల కమిటీ నాయకులను ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆశావహ అభ్యర్థి కోవ దౌలత్ రావు మొకాశి మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ ప్రస్తుత పరిస్థితులను చర్చించి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బారిలో ఉంటానని మండల నాయకులతో చెప్పారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తోడషం దౌలత్ రావ్, గుడిహత్నూర్ యంపిటిసి అంకత్ సవిత-రవి, గురుజ్ యంపిటిసి పేందోర్ లలితజయరాం, జిల్లా కార్యదర్శి ఆసిఫ్,యస్సి సెల్ మండల కన్వీనర్ దుబ్బాక నరేష్, సీనియర్ నాయకులు ససానే మాధవ్, విష్ణుకాంత్,కోత్తురి అర్జున్,దోమ్మటి సురేష్ ,ధరంసింగ్ జాదవ్, సందీప్ రాథోడ్,కోవ ప్రభాకర్,పవర్ కృష్ణ, విష్ణు పోలే,శకిల్, కాక్డే ఎక్నథ్ పాటేల్,కేడిఆర్ సైన్యం అధ్యక్షులు కాత్లె బుచ్చన్న, కుడ్మేత లవాన్, తదితరులు పాల్గొన్నారు