కాంగ్రెస్ లో చేరిన మందమర్రి సింగిల్ విండో చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ సాల్వాజీ ప్రభాకర్ రావు

సిరా న్యూస్,మందమర్రి;
మందమర్రి సింగిల్ విండో చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ సాల్వాజీ ప్రభాకర్ రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఈరోజు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు ప్రజలకు మేలు చేస్తాయని అలాగే కాకా కుటుంబం నిరంతరం సేవ చేయడమే వారి లక్ష్యం అని వారు అధికారంలో ఉన్న లేకున్నా పేద ప్రజలకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ సప్లై అలాగే ట్యాంకర్లు మోటర్లు స్కూల్ బెంచీలు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వారి తనయుడు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయినాక చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తుందని అలాగే వారి తనయుడు గడ్డం వంశీకృష్ణ గారు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోతుకు సుదర్శన్ బత్తుల రమేష్ మండ భాస్కర్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నెరువట్ల శ్రీనివాస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గడ్డం రజిని మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి జమీల్ గోగుల రాజయ్య సట్ల రవీందర్ రాచర్ల రవికుమార్ ఎండి సుకుర్ యువజన కాంగ్రెస్ నాయకులు సజ్జు కనకంరాజు వడ్లూరు సునీల్ కుమార్ విజయ్ మహిళా నాయకురాల్ రాధా స్రవంతి ఆలం శంకరు మంకు రమేష్ కడలి శ్రీనివాసరావు పిండి ఐలయ్య రమేష్ రాజు క్రాంతి కిషోర్ తదితరులు పాల్గొన్నారు
================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *