సిరా న్యూస్, భీమదేవరపల్లి
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ వడ్డెర కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
సంఘటన స్థలాన్ని ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు పరిశీలించారు. మరణించిన వ్యక్తి కి 50 ఏళ్ల వయస్సు ఉంటుంది. మృతుడు తాపీ మేస్త్రి చేసే వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా గుర్తుపట్టినట్లయితే ముల్కనూర్ పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని ఎస్సై సాయిబాబు తెలిపారు.