సిరాన్యూస్, జైనథ్
ఉరివేసుకొని ఇద్దరు మృతి
వేరువేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం… జైనథ్ గ్రామానికి చెందిన ఇప్ప సుధాకర్ (35)మద్యానికి బానిసై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందారు. ఆయనకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పురుషోత్తం వెల్లడించారు. అలాగే జైనథ్ గ్రామానికి చెందిన కనకం రాందాస్ (70) మంగళవారం కాళ్ల నొప్పులు భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలిపారు.ఈయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శవాల పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి మార్చురీకి తరలించినట్టు ఎస్సై తెలిపారు.