సిరా న్యూస్,హుజూర్ నగర్;
హుజూర్ నగర్ నియోజకవర్గంలో పాలకీడు మండలం మహంకాళి గూడెం గ్రామంలో గ్రామ శివారులోని ఫారెస్టులో ఏమాత్రం అనుమతులు లేకుండా నడుపుతున్న డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీని వెంటనే మూసీవేయాలని ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర డిమాండ్ చేశారు. హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం న్యాయస్థానాలను , కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘన చేస్తుందని ఆరోపించారు. గత పాలకుల అండతో అధికారులు పూర్తిగా అవినీతిపరులకు వత్తాసు పలుకుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న పసుపులేటి సురేష్ ని చంపడానికి అనేక రకాల కుట్రలు పన్నారని ఆరోపించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పర్యావరణ పరిరక్షణ కోసం ముందు వరుసలో ఉంటానని అందుకోసం ప్రకృతి నా పరిపాలన సహకరిస్తుందని అనేక సందర్భాలలో ప్రకటించారని గుర్తు చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటివరకు డెక్కన్ సిమెంట్ సంస్థ చేసిన దోపిడీ,అక్రమాలు అన్యాయాల మీద సమగ్ర విచారణ జరిపించాలన్నారు. వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ పర్యావరణ ఉద్యమకారులను చంపేయాలని చూస్తున్నారన్నారు. ఈ అవినీతికి సహకరించిన అధిరులను అరెస్టు చేసి, వారి ఆస్తులు జప్తు చేయాలన్నారు.