సిరా న్యూస్,విశాఖపట్నం;
టీడీపీ మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. భీమిలి లో జరిగిన వైసీపీ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. తనను తాను అర్జునుడిగా పోల్చుకున్నాడు దీనిపై స్పందించిన గంటా.. జగన్ అర్జునుడు అంటే.. రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవ చేశారు. అలాగే.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పులివెందులలో కూడా జగన్ ఓడిపోతాడని అన్నారు.అలాగే అధికారంలోకి రావడానికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా సరిగ్గా అమలు కాలేదని.. కేవలం 15 శాతం మాత్రమే అమలు చేసిందని విమర్శించారు. అలాగే ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలను గురించి ప్రజలకు బాగా అర్ధమైందని.. వీళ్లు పాండవులు కాదు కౌరవ సైన్యం.. అని విమర్శించారు. అలాగే ప్రజలపై నమ్మకం కోల్పోయిన జగన్ వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు.