సిరా న్యూస్, ఆదిలాబాద్:
బ్యాలెట్ ద్వార ఓటింగ్ నిర్వహించాలి…
ఈవీఎం ద్వార కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వార మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని బామ్సేప్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది గణేష్ మెకానే, బహుజన్ ముక్తి పార్టి ఆదిలాబాద్ జిల్లా« అధ్యక్షుడు సూర్యవంశీ విద్యాసాగర్ డిమాండ్ చేసారు. ఈ మేరకు శనివారం ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామల దేవికి వినతిపత్రం అందించారు. దేశవ్యాప్తంగా ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే అన్ని ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కోరారు.