Demand for Compensation: రైతులకు నష్ట పరిహారం అందించాలి…

సిరా న్యూస్, కందుర్పి:

రైతులకు నష్ట పరిహారం అందించాలి…
+ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆ«ధ్వర్యంలో ఆందోళన
+ రైతులను ఆదుకోవాలని డిమాండ్‌

అనంతపురం జిల్లా కనెకల్‌ మండలంలో పంట నష్టపోయిన రైతులను వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్‌ చేసారు. సోమవారం కనేకల్‌ మండల కేంద్రంలో తహాసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతు కూలీలు, నాయకులతో కలిసి ఆందోళ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహాసీల్దార్‌ను కలిసి లిఖిత పూర్వకంగా వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రైతుల పాత రుణాలు మాఫీ చేసి, కొత్తగా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేసారు. రైతు కూలీలకు ఉపాధిహామీ పథకంలో పని కల్పించడంతో పాటు రోజుకు కనీసం రూ. 600 కూలీ అందించాలన్నారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు రుణాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేసారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని రద్ధు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యుడు మల్లయ్య, నాయకులు కలేందర్, లింగన్న, చిక్కన్న, శంకుతలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *