సిరా న్యూస్, ఆదిలాబాద్:
సోయా కొనుగోలు కేంద్రాలను పుఃన ప్రారంభించాలి…
రైతుల వద్ద సోయా నిలువలు ఉన్నందున అధికారులు వెంటనే సోయా కొనుగోలు కేంద్రాలను పునః ప్రారంభించాలని జైనథ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాలురి గోవర్ధన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ కు లిఖితపూర్వకంగా వినతి పత్రం అందించారు. బయట మార్కెట్లో సోయా ధర పడిపోవడంతో రైతులు, పంట అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రైతుల వద్ద నుండి సోయలు కొనుగోలు చేసి ఆదుకోవాలని అన్నారు. మండలంలో సోయా కొనుగోలు కేంద్రం పుఃన ప్రారంభించడానికి మార్కెట్ అధికారులను ఆదేశించాలని ఆయన విన్నవించారు.