సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా దుండిగల్ మండల పరిధి లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను మండల రెవెన్యూ అధికారులు కూల్చివేసారు. ఎన్నికల హడావుడి లో అధికారులు బిజీ గా ఉండటంతో భూ అక్రామదారులు ప్రభుత్వ స్థలాలను ఎంచుకొని కబ్జా లకు పాల్పడి నిర్మాణాలు చేపట్టారు. గాగిలాపూర్ సర్వే నెం : 214, దోమ్మర పోచంపల్లి సర్వే నెం: 120 లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. దుండిగల్ రెవెన్యూ పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కూల్చివేస్తామని హెచ్చరించారు.