చలి, భారీ ఈదురు గాలులతో ఇబ్బందులు పడుతున్న భక్తులు
పొగమంచుతో శ్రీవారి పాదాలు, పాప వినాశం దారులు మూసివేత
సిరా న్యూస్,తిరుమల;
తిరుమల క్షేత్రంలో చలి పులి ధాటికి భక్తులు గజగజ వణుకు తున్నారు. తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చల్లబడిన ఏడుకొండలు…ప్రస్తుతం వాతావరణం మార్పుతో మంచు కొండలనుతలపిస్తుంది.. ఆధ్యాత్మిక భావనతో పాటు ప్రకృతి సోయగాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. శ్రీవారి అలయంతో పాటు పొగమంచు తిరుమల అంతటా వ్యాపించి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పిల్లలనుంచి పెద్దల వరకు ఈ ప్రకృతి అందాలు చూసి పులకించిపోతున్నారు. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులను ఇదివరకెన్నడూ చూడని అందాలు పలకరిస్తున్నాయి. తిరుమల కనుమ రహదారుల్లోమేఘాలు చేతికందేంత కిందిదిగి పలకరిస్తున్నాయి. పొగమంచు దుప్పట్లు కమ్ముకుని అహ్లాదం కలిగిస్తున్నాయి. ఈ ప్రకృతి అందాలు తిరుమల కనుమ రహదారులపై భక్తులను ఆనంద పరవశులనుచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గి చలితీవ్రత బాగా పెరగడంతో కొందరు భక్తులు ఇబ్బందులు పడుతుంటే, మబ్బులు నెలకు దిగాయా అన్నట్టు దట్డంగా కమ్ముకున్న మంచు అందాలను
ఆస్వాధిస్తున్నారు.